INDw Vs PAKw: మహిళల ఆసియా కప్.. హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్.. పాక్ చేతిలో భారత్ ఓటమి
వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత మహిళల జట్టుకు ఆసియా కప్లో తొలి ఓటమి ఎదురైంది. పాకిస్థాన్ చేతిలో ఓడింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పాక్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో వరుసగా మూడు మ్యాచ్లను గెలిచిన భారత మహిళల జట్టు తొలి ఓటమిని మూటగట్టుకొంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా పరాభవం ఎదుర్కొంది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత లోయర్ ఆర్డర్ బ్యాటర్ రిచా ఘోష్ (26) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17, రోడ్రిగ్స్ 2, దయాలన్ హేమలత 20, పూజా వస్త్రాకర్ 5, దీప్తి శర్మ 16, హర్మన్ ప్రీత్ కౌర్ 12, రాధా యాదవ్ 3, రేణుకా సింగ్ 2* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నస్రా సంధు 3, సాదియా ఇక్బాల్ 2, నిదా దార్ 2.. ఐమన్ అన్వర్, తుబా హసన్ చెరో వికెట్ తీశారు. భారత్ శనివారం (అక్టోబర్ 8న) బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ విజయంతో పాక్ నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లను సొంతం చేసుకొంది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీమ్ఇండియాపై పాక్ విజయం సాధించడం గమనార్హం.
నిదా దార్ కీలక ఇన్నింగ్స్
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు సాధించేందుకు పాకిస్థాన్ టాప్ ఆర్డర్ ఇబ్బంది పడింది. పవర్ ప్లే ముగిసేసరికి 33 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. అయితే కెప్టెన్ మరూఫ్ (32)తో కలిసి నిదా దార్ (56*) కీలక భాగస్వామ్యం (76 పరుగులు) నిర్మించింది. మరోసారి టీమ్ఇండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప వ్యవధిలో పాక్ వికెట్లను చేజార్చుకొంది. అయితే నిదా దార్ చివరి వరకు క్రీజ్లో ఉండి పాక్కు పోరాడే స్కోరును అందించింది. మునీబా అలీ 17, అమీన్ 11, అలియా రియాజ్ 7, అయేషా నసీమ్ 9 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, పూజా వస్త్రాకర్ 2, రేణుకా సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!