Dhruva 2: ‘ధృవ-2’పై మోహన్‌రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (RamCharan) ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ధృవ’ (Dhruva). సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఇదే సినిమా కొనసాగింపుపై దర్శకుడు మోహన్‌రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 07 Oct 2022 14:54 IST

హైదరాబాద్‌: యువ హీరో రామ్‌చరణ్‌ (RamCharan) ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ధృవ’ (Dhruva). సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కోలీవుడ్‌లో మోహన్‌రాజా తెరకెక్కించిన ‘తనీ ఒరువన్‌’కు రీమేక్‌గా ఇది విడుదలై తెలుగు వారిని అలరించింది. ఈ సినిమా సీక్వెల్‌పై తాజాగా దర్శకుడు మోహన్‌ రాజా స్పందించారు.

ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ‘‘నేను ఇప్పటికే ‘తన్ని ఒరువన్‌ -2’ కోసం కథ సిద్ధం చేశాను. పార్ట్‌-1తో పోలిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. జయం రవితోపాటు (తనీఒరువన్‌ హీరో) రామ్‌చరణ్‌కీ ఈ కథ వినిపించాను. చరణ్‌కు కథ బాగా నచ్చింది. అన్ని అనుకున్నట్టే జరిగితే సరైన సమయంలోనే ఇది పట్టాలెక్కనుంది’’ అని పేర్కొన్నారు. ఇక మోహన్‌రాజా ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపించారు. సత్యదేవ్‌ ప్రతినాయకుడు. విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని