Corona: కేరళలో ఒకేరోజు 54 వేలకు పైగా కేసులు.. 352 మంది మృతి
కేరళలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా మళ్లీ 50వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. 352మంది మృతిచెందారు. కొత్తగా వచ్చిన కొవిడ్ మరణాల్లో......
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా మళ్లీ 50 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1.15 లక్షల టెస్టులు చేయగా.. 54,534 కేసులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, కొవిడ్ బాధితుల్లో 30,225 మంది కోలుకోగా, 352 మంది మృతిచెందినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,33,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు మహారాష్ట్రలోనూ భారీగా మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం 24,948 మంది కొవిడ్ బారిన పడగా.. ఏకంగా 103 వైరస్ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయి. గత అక్టోబర్ తర్వాత మహారాష్ట్రలో ఇవే అత్యధిక మరణాలు. తాజా కేసుల్లో 110 ఒమిక్రాన్గా నిర్ధరణ అయ్యాయి. పాజిటివిటీ రేటు 10.32 శాతంగా నమోదైంది. రాజధాని ముంబయిలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 1312కి వైరస్ సోకగా 10 మంది మరణించారు. 14,344 యాక్టివ్ కేసులున్నాయి.
గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 31,198 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. 50 మంది మృత్యువాతపడ్డారు. పాజిటివిటీ రేటు 20.91శాతంగా ఉంది. అయితే రాష్ట్రంలోని దాదాపు సగం కేసులు రాజధాని నుంచే ఉన్నాయి. బెంగళూరులో 15,199 కేసులు వెలుగుచూశాయి. అయితే బయటపడిన కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్వే ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.కె.సుధాకర్ వెల్లడించారు. ఆ తర్వాతి స్థానంలో ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం