Suicide: చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

చెరువులోకి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం నువులూరుకు చెందిన శ్వేత (22) చిల్లపల్లి వద్ద చెరువులోకి దూకి బలవన్మరణానికి

Updated : 03 Jul 2022 13:27 IST

జగ్గయ్యపేట: చెరువులోకి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం నువులూరుకు చెందిన శ్వేత (22) చిల్లపల్లి వద్ద చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. గత మూడు నెలలుగా వర్క్‌ప్రమ్‌ హోం ద్వారా విధులు నిర్వహిస్తున్న శ్వేత.. ఆదివారం ఆప్టమ్‌ సంస్థల్లో విధుల్లో చేరాల్సి ఉంది.

అయితే శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన యువతి.. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ రాత్రి 8 గంటలకు తల్లికి వాట్సాప్‌లో మెసేజ్‌ పంపింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మండలం చిల్లపల్లి చెరువులో శ్వేత మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని