దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్‌ రేప్‌: ఐదుగురు యువకులు అరెస్టు!

అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు మైనర్‌ బాలికలపై మావూ జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. 17, 15 ఏళ్ల వయసున్న.....

Updated : 17 Oct 2022 15:20 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు మైనర్‌ బాలికలపై మావూ జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాలికల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను శనివారం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటన ద్వసరై గ్రామంలోని ఘోసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా.. బాలికల తండ్రి జూన్‌ 30న ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన కుమార్తెలిద్దరూ బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో నిందితులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనగా.. వారిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపువారేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని