Kidnap: చంద్రగిరిలో వైద్యురాలి కిడ్నాప్‌.. ప్రేమ పెళ్లి ఇష్టం లేకనే..!

ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ వైద్యురాలిని కొంతమంది కిడ్నాప్‌ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మోహన్‌రెడ్డి కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 07 Oct 2022 14:48 IST

చంద్రగిరి: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ వైద్యురాలిని కొంతమంది కిడ్నాప్‌ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మోహన్‌రెడ్డి కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యురాలి కుటుంబసభ్యులే పథకం ప్రకారం కిడ్నాప్‌ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన సుష్మ.. చంద్రగిరి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ మోహన్‌కృష్ణ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల క్రితం వాళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి సుష్మ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో ఎన్నోసార్లు ఆమెను తిరిగి తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి సుమారు సుమారు 30 మంది వ్యక్తులు కత్తులు, రాడ్లతో మోహన్‌కృష్ణ ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారు. ఇంటి అద్దాలు, టీవీ, ఫర్నీచర్‌, తలుపులను ధ్వంసం చేసి గదిలో ఉన్న సుష్మాను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. 

మోహన్‌కృష్ణ డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు సుష్మాను తీసుకుని వెళ్లిపోవడంతో మోహన్‌కృష్ణ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఆమెను గుంటూరు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై మోహన్‌కృష్ణ కుటుంబసభ్యులు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని