Modi: నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం.. మోదీ ఆకాంక్ష
నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపే సత్తా భారత్కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు.
కెవడియా: నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపే సత్తా భారత్కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. ఇండస్ట్రీ 4.0 పేరిట గుజరాత్లోని కెవడియాలో జరిగిన సమావేశంలో శుక్రవారం ప్రధాని సందేశాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి చదివి వినిపించారు.
నాలుగో పారిశ్రామిక విప్లవం పూర్తిగా టెక్నాలజీ, నవీన ఆవిష్కరణల ఆధారితమైందని మోదీ పేర్కొన్నారు. పలు కారణాల వల్ల భారత్ గత పారిశ్రామిక విప్లవాల్లో కీలక పాత్ర పోషించలేకపోయిందన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ను కీలక భాగస్వామిగా మార్చడంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు.
భారత్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. మెషీన్ లెర్నింగ్, త్రిడీ ప్రింటింగ్, డేటా అనలిటిక్స్, ఐఓటీ.. వంటి రంగాలకు భారత పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు నడిపించనున్నాయని పేర్కొన్నారు. ‘అడ్వాన్స్డ్ కెమికల్ సెల్ (ACC)’ బ్యాటరీ స్టోరేజ్ పరిశ్రమకు ప్రకటించిన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (PLI)’ వల్ల భవిష్యత్తులో భారత్కు బ్యాటరీ దిగుమతులు తగ్గుతాయని తెలిపారు. రూ.18 వేల కోట్ల రాయితీల వల్ల దేశీయ కంపెనీలు బ్యాటరీల తయారీని పెంచనున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా